
షోస్

‘బిగ్ బాస్ తెలుగు’ హౌస్లోకి అడుగుపెట్టబోయే సెలబ్రిటీ కంటెస్టెంట్ల లిస్ట్పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. ప్రచారంలో ఉన్న సమాచారం ప్రకారం దేబ్జానీ మోదక్, యాంకర్ వర్షిణి, చైత్రా రాయ్, ముఖేష్ గౌడ, త్రిగుణ్ (ఆదిత్ అరుణ్), నటుడు కృష్ణుడు, జబర్దస్త్ నరేష్, జబర్దస్త్ రామ్ ప్రసాద్, టెంపర్ వంశీ, యాంకర్ సుధీర్ రెడ్డి బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ఈ జాబితాలో నటులు, టీవీ యాంకర్లు, ఎంటర్టైన్మెంట్ రంగానికి చెందిన ప్రముఖులు ఉన్నారు. ఇప్పటికే ప్రేక్షకులకు పరిచయమైన పలువురు సెలబ్రిటీలు హౌస్లోకి అడుగుపెట్టనున్నారనే ప్రచారంతో కొత్త సీజన్పై అంచనాలు పెరుగుతున్నాయి. వీరి మధ్య ఆట ఎలా సాగుతుంది, ఎవరు ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటారనే ఆసక్తి నెలకొంది. అయితే తుది కంటెస్టెంట్ల జాబితాపై నిర్వాహకుల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!