
రాజకీయాలు

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఆమె కుమార్తె అంజలి రెడ్డి వివాహ ముహూర్తం ఖరారైంది. అమెరికాకు చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ సోమాల రఘురాం రెడ్డితో అంజలి వివాహం జరగనుంది. అంజలి-రఘురాం రెడ్డి వివాహ మహోత్సవ వేడుకను షర్మిలా రెడ్డి ఎక్స్ వేదికగా ప్రకటించారు.
డాక్టర్ రఘురాం రెడ్డి సోమాల సుబ్బారెడ్డి, పద్మ దంపతుల కుమారుడు. ఆయన కర్నూలు జిల్లాకు చెందినవారు కాగా, కుటుంబం చాలాకాలంగా అమెరికాలో స్థిరపడింది. అమెరికాలో వైద్యుడిగా స్థిరపడిన రఘురాం రెడ్డితో అంజలి వివాహం జరగనున్న నేపథ్యంలో ఇరు కుటుంబాల్లోనూ సందడి నెలకొంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!