

‘బిగ్బాస్ తెలుగు’ హౌస్లోకి ‘అగ్నిపరీక్ష’ ద్వారా ఎంపికైన ఆరుగురు కామనర్లు అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. వీరిలో ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు ఉన్నట్లు సమాచారం. షో కొనసాగుతున్న సమయంలో మరో నలుగురికి వైల్డ్ కార్డ్, గోల్డెన్ ఛాన్స్ల ద్వారా హౌస్లోకి వచ్చే అవకాశం కల్పించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం హౌస్లోకి ఎంట్రీ ఇవ్వనున్న కామనర్లుగా ఝాన్సీ, షాలిని పటేల్, శ్రష్ఠి, రోహిత్ నాయుడు, చరణ్, అమన్ మసూద్ పేర్లు వినిపిస్తున్నాయి.
సెలబ్రిటీలతో పాటు సామాన్యులను కూడా హౌస్లోకి తీసుకురావడంతో ఈ సీజన్లో పోటీ మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. ఎలాంటి సినీ, టీవీ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన కామనర్లు సెలబ్రిటీలతో కలిసి ఎలా ఆడతారు, ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటారనే ఆసక్తి నెలకొంది. అయితే ప్రస్తుతం ప్రచారంలో ఉన్న కామనర్ల జాబితాతో పాటు భవిష్యత్తులో జరగబోయే వైల్డ్ కార్డ్ ఎంట్రీలపై నిర్వాహకుల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!