

ఆంధ్రప్రదేశ్లో పికిల్బాల్కు మరింత ఆదరణ తీసుకురావడంతో పాటు ప్రతిభావంతులైన యువ క్రీడాకారులకు పోటీ వేదిక కల్పించడమే లక్ష్యంగా ఆంధ్రా పికిల్బాల్ లీగ్ (ఏపీఎల్) ప్రారంభమైంది. శనివారం ఇక్కడి నైట్రో పికిల్ కెఫేలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, ఏపీఎల్ చైర్మన్, చీఫ్ ప్యాట్రన్ సుజయ్ కృష్ణ రంగారావు లీగ్ను ప్రారంభించారు. రాష్ట్రంలో పికిల్బాల్ క్రీడను ప్రోత్సహించడంతో పాటు యువ క్రీడాకారులకు తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశాలు కల్పించడమే లీగ్ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.
ఏపీఎల్లో మొత్తం 8 జట్లు పోటీపడుతున్నాయి. గోదావరి సెలెస్టియల్స్, అమరావతి ఫోనిక్స్, తిరుపతి టైగర్స్, నెల్లూరు నింజాస్, వైజాగ్ సీ హాక్స్, రాయల్స్ ఆఫ్ రాయలసీమ, భీమవరం బుల్స్, విజయవాడ సన్షైనర్స్ బరిలో ఉన్నాయి. ఈ జట్ల కోసం ఫ్రాంచైజీలు మొత్తం 88 మంది ఆటగాళ్లను దక్కించుకున్నాయి. ఈనెల 23 వరకు లీగ్ మ్యాచ్లు కొనసాగనున్నాయి. లీగ్ ఫైనల్ను విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ టోర్నమెంట్ ద్వారా రాష్ట్రంలో పికిల్బాల్ క్రీడకు మరింత ప్రాచుర్యం లభిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!