
గాసిప్స్

నేషన్స్ కప్లో సాధించిన విజయం భారత మహిళల హాకీ జట్టులో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచిందని కెప్టెన్ సలీమా టెటే తెలిపింది. అదే జోష్తో రాబోయే వరల్డ్కప్లోనూ మెరుగైన ప్రదర్శన చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. గ్రూప్-డిలో చైనా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా వంటి బలమైన జట్లతో భారత్ తలపడనుంది.
ఈసారి వరల్డ్కప్లో పతకం సాధించగలమన్న నమ్మకం తనకు ఉందని టెటే పేర్కొంది. దూకుడుగా ఆడటంతో పాటు సరైన వ్యూహాలను అమలు చేయడం కీలకమని చెప్పింది. ఒత్తిడికి లోనుకాకుండా స్వేచ్ఛగా ఆడాలని సహచరులకు సూచించింది. జట్టులోని ప్రతి ఆటగాడిపై పూర్తి నమ్మకం ఉందని, సమష్టి కృషితో మంచి ఫలితాన్ని సాధించగలమని టెటే ధీమా వ్యక్తం చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!