
సినిమాలు

ఆసియా క్రీడల జట్టులో తనను ఎంపిక చేయకపోవడంపై భారత టేబుల్ టెన్నిస్ స్టార్ మనికా బాత్రా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తనను జట్టు నుంచి ఎందుకు తప్పించారో స్పష్టమైన వివరణ ఇవ్వకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఫెడరేషన్ను హెచ్చరించింది. ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోదీ, క్రీడా శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయ జోక్యం చేసుకోవాలని ఆమె కోరింది.
తాను ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్లో 51వ స్థానంలో ఉన్నానని మనికా పేర్కొంది. ఎంపిక ప్రమాణాలు ఎలా నిర్ణయించారో ఫెడరేషన్ సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేసింది. గతంలో భారత్కు పతకం సాధించిన క్రీడాకారిణి ఐకా ముఖర్జీకి కూడా చోటు దక్కలేదని ఆమె పేర్కొంది. ఆసియా క్రీడలు సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్లో జరగనున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!