

2018లో ప్రధాన స్పాన్సర్ వైదొలగడంతో భారత పురుష, మహిళల హాకీ జట్లు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. ఆ క్లిష్ట సమయంలో ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ముందుకొచ్చి జాతీయ క్రీడా జట్టుకు నేరుగా స్పాన్సర్గా నిలిచిన తొలి రాష్ట్ర ప్రభుత్వంగా చరిత్ర సృష్టించారు. ఐదేళ్లకు రూ.140 కోట్ల ఒప్పందం కుదుర్చి ఆటగాళ్ల శిక్షణ, పోషకాహారం, అత్యాధునిక పరికరాలు, కోచింగ్, విదేశీ పర్యటనలు వంటి అన్ని అంశాలకు మద్దతు అందించారు.
ఈ పెట్టుబడి భారత హాకీ పునరుద్ధరణలో కీలక పాత్ర పోషించింది. 2021 టోక్యో ఒలింపిక్స్లో భారత పురుషుల జట్టు 41 ఏళ్ల తర్వాత కాంస్య పతకం సాధించగా, మహిళల జట్టు నాలుగో స్థానంలో నిలిచింది. 2024 పారిస్ ఒలింపిక్స్లోనూ పురుషుల జట్టు మరోసారి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. నవీన్ పట్నాయక్ ఆధ్వర్యంలో రూర్కెలాలో ప్రపంచంలోనే అతిపెద్ద బిర్సా ముండా అంతర్జాతీయ హాకీ స్టేడియం నిర్మించడంతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 ఆస్ట్రోటర్ఫ్ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయన ప్రారంభించిన ఈ దూరదృష్టి ప్రణాళిక భారత హాకీ అభివృద్ధికి దీర్ఘకాలిక బాటలు వేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!