

ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాజయం అనంతరం పాకిస్థాన్ క్రికెట్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కోచింగ్ సిబ్బందిపై పీసీబీ చర్యలు తీసుకోవడాన్ని మాజీ క్రికెటర్లు తీవ్రంగా తప్పుబడుతున్నారు. సర్ఫరాజ్ అహ్మద్, ఉమర్ గుల్ను స్వదేశానికి పిలిపించడం, మిస్బా ఉల్ హక్ సెలక్టర్ పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ పీసీబీ నిర్ణయాలపై తీవ్ర విమర్శలు చేశాడు.
పీసీబీ జట్టును ‘రిమోట్ కంట్రోల్’తో నడుపుతున్నట్లుగా వ్యవహరిస్తోందని లతీఫ్ ఆరోపించాడు. కోచ్లను, సిబ్బందిని వరుసగా మార్చుతున్న బోర్డు తదుపరి లక్ష్యం కెప్టెన్ బాబర్ అజామ్ కావచ్చని వ్యాఖ్యానించాడు. బాబర్ అజామ్ కూడా పరిస్థితులకు వ్యతిరేకంగా నిలబడి కెప్టెన్సీకి రాజీనామా చేసి ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు. పీసీబీ నిర్ణయాలపై బాబర్ మౌనంగా ఉండటాన్ని ప్రశ్నిస్తూ, అతడిని ‘డమ్మీ కెప్టెన్’గా లతీఫ్ అభివర్ణించాడు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!