

కొలంబో వేదికగా భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టు ఐదో రోజు ఆటలో ఆతిథ్య జట్టు పట్టుదలగా పోరాడుతోంది. ఓవర్నైట్ స్కోరు 229/6తో ఇన్నింగ్స్ను ప్రారంభించిన శ్రీలంక.. క్రమంగా ఆధిక్యాన్ని పెంచుకుంటూ 92 ఓవర్లలో 302/6కు చేరుకుంది. ఏడో వికెట్కు కేశర నువాంత (37*), సోనాల్ దినుష (39*) అజేయంగా 84 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 166 బంతుల్లో ఈ జోడీ 84 పరుగులు జోడించడంతో శ్రీలంక ఆధిక్యం 89 పరుగులకు చేరింది.
భారత స్పిన్నర్లు రవీంద్ర జడేజా, మానవ్ సుతార్, సారాంశ్ జైన్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినప్పటికీ కీలక వికెట్ దక్కలేదు. దీంతో వికెట్ కోసం టీమ్ఇండియా కొత్త బంతిని తీసుకుంది. అయినప్పటికీ కేశర నువాంత, సోనాల్ దినుష ఏమాత్రం తడబడకుండా బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు. ఈ భాగస్వామ్యాన్ని విడదీసి శ్రీలంకను తక్కువ స్కోరుకే పరిమితం చేయాలని భారత బౌలర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!