27, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మత్స్యకారుల భద్రత విషయంలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది - తిరుపతి ఎంపీ గురుమూర్తి

Writer: Chandrika 11:23 AM, 27 ఆగస్టు, 2026
మత్స్యకారుల భద్రత విషయంలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది - తిరుపతి ఎంపీ గురుమూర్తి

మత్స్యకారుల భద్రత విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తిరుపతి ఎంపీ గురుమూర్తి ఆరోపించారు. ప్రతి రెండు మూడు నెలలకు మత్స్యకారుల బోట్లు ప్రమాదాలకు గురవుతున్నా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఆగస్టులో అంబేద్కర్, కోనసీమ బోట్లకు చెందిన తొమ్మిది మంది మత్స్యకారులు సముద్రంలో చిక్కుకున్న ఘటనను ఆయన ప్రస్తావించారు. సముద్రం మధ్యలో బోటు మరమ్మతుకు గురై బంగ్లాదేశ్ వైపు కొట్టుకుపోవడంతో మత్స్యకారులు 24 రోజుల పాటు నరకయాతన అనుభవించారని, చావుబతుకుల మధ్య గట్టెక్కారని తెలిపారు. శ్రీలంక, బంగ్లాదేశ్ ఎంబసీలకు సమాచారం అందించడంతో పాటు కోస్ట్‌గార్డ్ అధికారులతో సంప్రదింపులు జరిపామని చెప్పారు. చివరకు పశ్చిమ బెంగాల్ సమీపంలో మత్స్యకారులను గుర్తించి స్థానిక మత్స్యకారుల సహాయంతో వారిని ఒడ్డుకు చేర్చినట్లు వెల్లడించారు.

మత్స్యకారులకు ఇప్పటివరకు సరైన సేఫ్టీ ఆడిట్ ఎందుకు నిర్వహించలేదని గురుమూర్తి ప్రశ్నించారు. మత్స్యకారులకు శాటిలైట్ ఫోన్లు, బోట్లకు నావిగేషన్ సదుపాయాలు, పవర్ బ్యాకప్ ఎందుకు కల్పించలేదని నిలదీశారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంకల్లో పట్టుబడుతున్న మత్స్యకారుల్లో ఏపీకి చెందినవారే అధికంగా ఉన్నారని పేర్కొన్నారు. మత్స్యకారులకు సముద్ర భద్రతపై సరైన అవగాహన కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. బోట్లకు నావిగేషన్, పవర్ బ్యాకప్‌తో పాటు మత్స్యకారులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేసింది. వైఎస్ జగన్ ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వం స్పందించిందని, ఇందుకు కేంద్రానికి ధన్యవాదాలు చెబుతున్నామని గురుమూర్తి తెలిపారు. వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్న సమయంలో మత్స్యకారుల కోసం అనేక ఏర్పాట్లు చేశామని, కొత్త బోట్లు అందించాలని నిర్ణయించినప్పటికీ ఎన్నికల కోడ్ కారణంగా అమలు కాలేదని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మత్స్యకారుల సమస్యలను గాలికి వదిలేసిందని ఆయన ఆరోపించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రాహుల్‌ గాంధీపై హిమంత బిశ్వ శర్మ ఘాటు వ్యాఖ్యలు

రాహుల్‌ గాంధీపై హిమంత బిశ్వ శర్మ ఘాటు వ్యాఖ్యలు

22ఏ భూములపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

22ఏ భూములపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

టీఎంసీ ఎంపీలకు స్పీకర్‌ ఓం బిర్లా నోటీసులు..

టీఎంసీ ఎంపీలకు స్పీకర్‌ ఓం బిర్లా నోటీసులు..

రాజీనామాకు సిద్ధమైన కర్ణాటక మంత్రి ..

రాజీనామాకు సిద్ధమైన కర్ణాటక మంత్రి ..

రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనపై కిషన్ రెడ్డి ఫైర్..

రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనపై కిషన్ రెడ్డి ఫైర్..

సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనపై సగం, సగం తెలిసిన నేతలు మాట్లాడుతున్నారు: ఎంపీ చామల కిరణ్

సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనపై సగం, సగం తెలిసిన నేతలు మాట్లాడుతున్నారు: ఎంపీ చామల కిరణ్

ట్యాగ్లు
తిరుపతి ఎంపీ గురుమూర్తిఏపీ మత్స్యకారులుమత్స్యకారుల భద్రతఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంమత్స్యకారుల బోట్లుకోస్ట్‌గార్డ్శాటిలైట్ ఫోన్లుబోటు నావిగేషన్వైఎస్సార్‌సీపీమత్స్యకారుల సమస్యలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రైతుల భూములను 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించాలి: హరీశ్ రావు
జనరల్

రైతుల భూములను 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించాలి: హరీశ్ రావు

‘టాక్సిక్’తో గీతూ మోహన్‌దాస్ కొత్త అవతారం.. వైరల్ వీడియోపై క్లారిటీ
సినిమాలు

‘టాక్సిక్’తో గీతూ మోహన్‌దాస్ కొత్త అవతారం.. వైరల్ వీడియోపై క్లారిటీ

‘ఇరుముడి’ పాప నక్షత్రకు ధనుష్ ప్రశంసలు
సినిమాలు

‘ఇరుముడి’ పాప నక్షత్రకు ధనుష్ ప్రశంసలు

బీహార్ నిరసనల్లో ఆరేళ్ల బాలుడు.. సీఎం రాజీనామాకు డిమాండ్
జనరల్

బీహార్ నిరసనల్లో ఆరేళ్ల బాలుడు.. సీఎం రాజీనామాకు డిమాండ్

40 ఏళ్లకు ఉసేన్ బోల్ట్ ఎంగేజ్‌మెంట్..
జనరల్

40 ఏళ్లకు ఉసేన్ బోల్ట్ ఎంగేజ్‌మెంట్..

ఆకాశం నుంచి ఫోన్ డ్రాప్.. గిన్నిస్ రికార్డ్!
జనరల్

ఆకాశం నుంచి ఫోన్ డ్రాప్.. గిన్నిస్ రికార్డ్!

మత్స్యకారుల భద్రత విషయంలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది - తిరుపతి ఎంపీ గురుమూర్తి
రాజకీయాలు

మత్స్యకారుల భద్రత విషయంలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది - తిరుపతి ఎంపీ గురుమూర్తి

భూపాలపల్లి మైన్స్‌ ఏడీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు
జనరల్

భూపాలపల్లి మైన్స్‌ ఏడీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు

కొలంబో టెస్టులో ఉత్కంఠ.. భారత్‌ను పరీక్షిస్తున్న శ్రీలంక
క్రీడలు

కొలంబో టెస్టులో ఉత్కంఠ.. భారత్‌ను పరీక్షిస్తున్న శ్రీలంక

యూఎస్ ఓపెన్‌: మిక్స్‌డ్ డబుల్స్‌ సెమీస్‌కు స్వితోలినా-మోన్‌ఫిల్స్‌ జోడీ...
క్రీడలు

యూఎస్ ఓపెన్‌: మిక్స్‌డ్ డబుల్స్‌ సెమీస్‌కు స్వితోలినా-మోన్‌ఫిల్స్‌ జోడీ...

మీరాలం బ్రిడ్జి పనులను పరిశీలించిన సీఎం
జనరల్

మీరాలం బ్రిడ్జి పనులను పరిశీలించిన సీఎం

మహిళల హాకీ ప్రపంచకప్‌:సెమీస్‌కు అడుగు దూరంలో ఆగిన భారత్‌..
క్రీడలు

మహిళల హాకీ ప్రపంచకప్‌:సెమీస్‌కు అడుగు దూరంలో ఆగిన భారత్‌..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!