

హ్యామ్స్ట్రింగ్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్న భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ త్వరలో ఇంగ్లాండ్తో జరిగే వన్డే సిరీస్ ద్వారా మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. ఐపీఎల్ 2026లో ఆర్సీబీకి టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించిన కోహ్లీ, 600కు పైగా పరుగులు సాధించాడు. గాయం కారణంగా ఆఫ్ఘనిస్తాన్తో వన్డే సిరీస్కు దూరమైన ఆయన, జూలై 14న బర్మింగ్హామ్లో జరిగే తొలి వన్డేలో బరిలోకి దిగే అవకాశం ఉంది.
ఇంగ్లాండ్ బ్యాటర్ జోర్డాన్ కాక్స్ ఇటీవల లండన్లో కోహ్లీతో జరిగిన భేటీ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. తమ సమావేశాన్ని గోప్యంగా ఉంచాలని ప్రయత్నించినప్పటికీ, ఎవరో రహస్యంగా ఫోటోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారని తెలిపాడు. కోహ్లీ కూడా సాధారణ వ్యక్తిలాగే జీవించాలనుకుంటాడని, కానీ అతనిపై ఉన్న అపారమైన అభిమానంతో అది సాధ్యపడడం లేదని ది గార్డియన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాక్స్ పేర్కొన్నాడు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!