
ఓటీటీ

విజయవాడ వేదికగా ఉమెన్ ఏపీఎల్ (డబ్ల్యూఏపీఎల్) వేలానికి సర్వం సిద్ధమైంది. నేడు జరగనున్న వేలంలో మొత్తం 191 మంది మహిళా క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. టోర్నీలోని నాలుగు ఫ్రాంచైజీలు ఆటగాళ్లను ఎంపిక చేసుకునేందుకు వేలంలో పాల్గొననున్నాయి.
ప్రతిభావంతులైన మహిళా క్రికెటర్లకు ఉమెన్ ఏపీఎల్ మంచి వేదికగా నిలవనుంది. నాలుగు ఫ్రాంచైజీలు తమ జట్ల అవసరాలకు అనుగుణంగా ఆటగాళ్లను కొనుగోలు చేయనున్న నేపథ్యంలో వేలంపై క్రీడాభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఏ ఆటగాళ్లకు భారీ ధర దక్కనుందో, ఏ జట్టు ఎవరిని సొంతం చేసుకోనుందో ఉత్కంఠ కొనసాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!