
జనరల్

దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సామ్సంగ్ ఈరోజు లండన్లో తన ఎనిమిదో తరం ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లను ఆవిష్కరించింది. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 అల్ట్రా, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 8 పేర్లతో విడుదల చేసిన ఈ ఫోన్లు గత మోడళ్లతో పోలిస్తే మరింత సన్నగా, తేలికగా ఉండటంతో పాటు పెద్ద డిస్ప్లేలు, ఆధునిక ఫీచర్లతో అందుబాటులోకి వచ్చాయి.
భారత మార్కెట్లో ఈ ఫోన్ల ధరలు మోడల్, వేరియంట్ను బట్టి రూ.1.25 లక్షల నుంచి రూ.2.60 లక్షల వరకు ఉన్నాయి. భారత వినియోగదారుల కోసం ప్రీ-ఆర్డర్లు బుధవారం అర్ధరాత్రి నుంచే ప్రారంభమయ్యాయి. కొత్త గెలాక్సీ ఫోల్డబుల్ ఫోన్లు ఆగస్టు 7 నుంచి విక్రయాలకు అందుబాటులోకి రానున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!