
జనరల్

రాబోయే రోజుల్లో స్మార్ట్ఫోన్ల ధరలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని నథింగ్ సీఈఓ కార్ల్ పై హెచ్చరించారు. ఏఐ రంగం వేగంగా విస్తరించడంతో మెమొరీ చిప్ల ధరలు దాదాపు 300 శాతం పెరిగినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ పరిణామం మొబైల్ తయారీ ఖర్చులపై భారీ ప్రభావం చూపుతోందని తెలిపారు.
ప్రస్తుతం స్మార్ట్ఫోన్ తయారీ ఖర్చులో మెమొరీ చిప్ వాటా 50 శాతానికి పైగా ఉందని ఆయన వివరించారు. అందువల్ల రాబోయే పండుగ సీజన్లో పెద్ద డిస్కౌంట్లు ఆశించకూడదని సూచించారు. కంపెనీలు ధరలను 30 శాతం వరకు పెంచడం లేదా స్పెసిఫికేషన్లు తగ్గించే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!