
సినిమాలు

దేశంలోని పలు రాష్ట్రాల ఆర్థిక వ్యయాలపై కాగ్ విడుదల చేసిన తాజా నివేదిక ఆసక్తికర అంశాలను వెలుగులోకి తీసుకొచ్చింది. ఆరు రాష్ట్రాల్లో వార్షిక ప్రభుత్వ వ్యయంలో 25 శాతానికి పైగా ఉద్యోగుల జీతాలకే వెచ్చిస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. దేశంలోనే అత్యల్పంగా గుజరాత్ తన మొత్తం ఖర్చులో 6.25 శాతం జీతాలకు కేటాయించగా, తెలంగాణలో ఈ వ్యయం 14 శాతంగా నమోదైంది.
పింఛన్లు, సబ్సిడీల వ్యయాల్లో కూడా రాష్ట్రాల మధ్య గణనీయమైన తేడాలు కనిపించాయి. తెలంగాణలో పింఛన్లపై 7.7 శాతం ఖర్చు చేయగా, ఛత్తీస్గఢ్లో అది కేవలం 6 శాతమే. సబ్సిడీల వ్యయంలో కర్ణాటక దేశంలో అగ్రస్థానంలో నిలిచి మొత్తం వ్యయంలో 14 శాతం సబ్సిడీలకే వెచ్చించింది. కర్ణాటకతో పోలిస్తే తెలంగాణ సబ్సిడీలపై దాదాపు సగం మాత్రమే ఖర్చు చేస్తున్నట్లు కాగ్ నివేదిక వెల్లడించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!