

అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావంతో ఈరోజు కూడా బంగారం ధరలు పెరిగిన స్థాయిలో కొనసాగుతున్నాయి. ఉదయం 6:00 గంటల సమయానికి హైదరాబాద్, విజయవాడల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,470, 22 క్యారెట్ల బంగారం రూ.1,31,510గా నమోదైంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,07,600గా ఉంది.
వెండి ధర కూడా స్వల్పంగా పెరిగింది. కిలో వెండిపై రూ.100 పెరుగుదలతో హైదరాబాద్, విజయవాడల్లో ధర రూ.2,34,900కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకుంటున్న మార్పులు, పెట్టుబడిదారుల కొనుగోళ్లు, భౌగోళిక పరిస్థితుల ప్రభావంతో పసిడి, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి.
హైదరాబాద్, వరంగల్, విశాఖపట్నం, గుంటూరు, చెన్నై, ముంబై, బెంగళూరు, కోల్కతా వంటి నగరాల్లో బంగారం ధరలు దాదాపు ఒకే స్థాయిలో కొనసాగాయి. అయితే న్యూఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం రూ.1,43,620, 22 క్యారెట్ల బంగారం రూ.1,31,660గా నమోదైంది. కొనుగోలు చేసే ముందు రోజువారీ ధరలను పరిశీలించాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: బంగారు ధరలు తరచుగా మారుతుంటాయి. కాబట్టి, ఆభరణాలు కొనుగోలు చేసే ముందు తాజా ధరలను మరోసారి సరిచూసుకోవడం మంచిది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!