

స్వయంప్రతిపత్తి ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో ప్రముఖ సంస్థ టెస్లా ‘సైబర్క్యాబ్’ రోబోటాక్సీ సేవలను అధికారికంగా ప్రారంభించింది. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ఆస్టిన్లో నిర్వహించిన ప్రత్యేక లాంచ్ ఈవెంట్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. డ్రైవర్ అవసరం లేకపోవడంతో పాటు స్టీరింగ్ వీల్, యాక్సిలరేటర్, బ్రేక్ పెడల్స్ కూడా లేని ఈ వాహనం ఆటోమొబైల్ రంగంలో కీలక మైలురాయిగా నిలుస్తుందని టెస్లా పేర్కొంది. ఇద్దరు ప్రయాణికులు మాత్రమే కూర్చునేలా దీనిని రూపొందించారు.
స్టీరింగ్, పెడల్స్ లేకపోవడంతో సైబర్క్యాబ్లో ప్రయాణికులకు మరింత విశాలమైన స్థలం లభిస్తుంది. ఇందులో సెంట్రల్ డిస్ప్లే, క్లైమేట్ కంట్రోల్ మాత్రమే ప్రధాన మాన్యువల్ కంట్రోల్స్గా ఉన్నాయి. స్టార్లింక్ వీ5 శాటిలైట్ కనెక్టివిటీ ఆధారంగా పనిచేసే ఈ వాహనంలో 4కే లైవ్ వీడియోలు, గేమింగ్ వంటి సదుపాయాలను ఆస్వాదించవచ్చు. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ దీనిని ‘చక్రాలపై కదిలే కంఫర్టబుల్ లాంజ్’గా అభివర్ణించారు. టెస్లా రోబోటాక్సీ యాప్ ద్వారా సైబర్క్యాబ్ను బుక్ చేసుకోవచ్చు. యాప్లో నలుగురు ప్రయాణించే మోడల్ వై ఎస్యూవీ ఆప్షన్ కూడా ఉంది.
48 kWh బ్యాటరీతో వచ్చే సైబర్క్యాబ్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 290–300 మైళ్ల రేంజ్ అందిస్తుందని టెస్లా తెలిపింది. ఇప్పటివరకు తమ రోబోటాక్సీలు మానవ ప్రమేయం లేకుండా 10 లక్షల మైళ్లకు పైగా ప్రయాణించినట్లు కంపెనీ పేర్కొంది. వ్యాపార సంస్థలు సైబర్క్యాబ్లను కొనుగోలు చేసి టెస్లా నెట్వర్క్లో నడిపించేలా ఆర్డర్లను స్వీకరించేందుకు కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. ఒక్కో వాహనం ధర సుమారు 25,000–30,000 డాలర్లు, అంటే దాదాపు రూ.28 లక్షల వరకు ఉండవచ్చని అంచనా.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!