

ఇరాన్–అమెరికా మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరల్లో మరోసారి హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. గత వారం రోజులుగా పసిడి ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు మరియు భౌగోళిక ఉద్రిక్తతల ప్రభావంతో ధరల్లో అస్థిరత కొనసాగుతోంది.
ఈ రోజు ఉదయం 7 గంటల సమయానికి, దేశంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,280, 22 క్యారెట్ల బంగారం రూ.1,31,340, 18 క్యారెట్ల బంగారం రూ.1,07,460 వద్ద నమోదైంది. జాతీయ స్థాయిలో కిలో వెండి ధర రూ.2,30,000గా ఉంది.
హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,280, 22 క్యారెట్ల ధర రూ.1,31,340గా కొనసాగుతోంది. ఈ రెండు నగరాల్లో కిలో వెండి ధర రూ.2,34,900గా ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు దాదాపు ఒకే విధంగా ఉండగా, ఢిల్లీ, అహ్మదాబాద్ వంటి నగరాల్లో స్వల్పంగా అధిక ధరలు నమోదయ్యాయి.
గమనిక: బంగారు ధరలు తరచుగా మారుతుంటాయి. కాబట్టి, ఆభరణాలు కొనుగోలు చేసే ముందు తాజా ధరలను మరోసారి సరిచూసుకోవడం మంచిది.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!