

అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్ జూన్ త్రైమాసికంలో రూ.7,043.5 కోట్ల ఆదాయంపై రూ.581 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. 2025-26 ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.5,842 కోట్ల ఆదాయంతో రూ.433 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. గతేడాదితో పోలిస్తే తాజా త్రైమాసికంలో ఆదాయం 21 శాతం, నికరలాభం 34 శాతం వృద్ధి చెందాయి. ఏప్రిల్-జూన్ మధ్య బెంగళూరులోని సర్జాపూర్లో 180 పడకల సామర్థ్యంతో కొత్త ఆసుపత్రిని ప్రారంభించినట్లు కంపెనీ తెలిపింది.
రానున్న ఐదేళ్లలో దేశవ్యాప్తంగా వివిధ ఆసుపత్రులను విస్తరించడం ద్వారా అదనంగా 5,800 పడకలను అందుబాటులోకి తీసుకురావాలని అపోలో హాస్పిటల్స్ ప్రణాళిక రూపొందించింది. ఆరోగ్య సంరక్షణ, డయాగ్నొస్టిక్స్, డిజిటల్ హెల్త్, ఫార్మసీ విభాగాలు మెరుగైన పనితీరు కనబరిచాయని అపోలో గ్రూప్ వ్యవస్థాపక ఛైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి తెలిపారు. భవిష్యత్తులోనూ అత్యున్నత వైద్య ప్రమాణాలను కొనసాగిస్తూ, క్రమశిక్షణతో కూడిన విస్తరణపై దృష్టి సారిస్తామని ఆయన పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!