

హైదరాబాద్కు చెందిన మౌలిక వసతుల సంస్థ బొండాడ ఇంజినీరింగ్కు ఎన్టీపీసీ రెన్యూవబుల్ ఎనర్జీ నుంచి కీలక ప్రాజెక్టు దక్కింది. గుజరాత్లోని ఖవ్డా సోలార్ పార్కులో 100 మెగావాట్ల అవర్ సామర్థ్యంతో వెనేడియం రిడాక్స్ ఫ్లో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఏర్పాటు చేయనున్నారు. డీలెక్ట్రిక్ సిస్టమ్స్ సాంకేతిక సహకారంతో ఈ ప్రాజెక్టును పది నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని నిర్వహణను కూడా పదేళ్లపాటు కంపెనీ చూసుకుంటుంది.
వీఆర్ఎఫ్బీ టెక్నాలజీ లిథియం బ్యాటరీలతో పోలిస్తే సురక్షితంగా ఉండి 25–30 సంవత్సరాలపాటు పనిచేస్తుందని అధికారులు తెలిపారు. దేశీయంగా లభించే వెనేడియం ఖనిజ వినియోగం వల్ల చైనా దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని పేర్కొన్నారు. కంపెనీ ఆర్డర్ బుక్ 2026-27 నాటికి రూ.15,000 కోట్లకు చేరుతుందని అంచనా. డేటా సెంటర్లు, రక్షణ రంగాల్లో విస్తరణతో 2030 నాటికి 30% ఆదాయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!