

ఉస్మానియా మెడికల్ కాలేజీ వసతి గృహంలో ర్యాగింగ్ ఘటన వెలుగులోకి రావడంతో 12 మంది విద్యార్థులపై పోలీసు, కళాశాల యాజమాన్యాలు చర్యలు చేపట్టాయి. 2025 బ్యాచ్కు చెందిన మొదటి సంవత్సరం విద్యార్థులను కొందరు చివరి సంవత్సరం విద్యార్థులు మానసికంగా వేధిస్తూ, వ్యక్తిగత పనులు చేయించుకుంటున్నట్లు ఆరోపణలు వచ్చాయి. జూనియర్లపై జరుగుతున్న వేధింపులను గుర్తించిన ఇంటర్న్షిప్ విద్యార్థులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
కళాశాల యాజమాన్యం వార్డెన్లు, విద్యార్థులతో సమావేశం నిర్వహించి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించినప్పటికీ, ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థులు తిరిగి జూనియర్లతో పాటు వారిని కాపాడేందుకు ప్రయత్నించిన ఇంటర్న్లపై కూడా దాడికి పాల్పడినట్లు సమాచారం. విచారణ కమిటీ నివేదిక ఆధారంగా ఫిర్యాదు నమోదు చేయడంతో పోలీసులు 12 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో భాగమైన వారందరినీ ఆరు నెలల పాటు సస్పెండ్ చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!