
జనరల్

తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో చీఫ్ శిఖా గోయల్ పై ఎక్స్ వేదికగా గుర్తు తెలియని వ్యక్తి అసభ్యకర, అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఘటనను పోలీసులు తీవ్రంగా పరిగణించారు. ఈ ఘటనపై ఐటీ చట్టంతో పాటు ఇతర సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
నిందితుడిని గుర్తించి అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. సోషల్ మీడియాలో అసభ్యకర, దూషణాత్మక లేదా అభ్యంతరకర పోస్టులు చేసే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!