
జనరల్

అంటార్కిటికాలోని క్రియాశీల అగ్నిపర్వతం మౌంట్ ఎరెబస్ నుంచి నిరంతరం సూక్ష్మ బంగారు ధూళి వెలువడుతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్స్లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం, ఈ అగ్నిపర్వతం నుంచి రోజుకు సుమారు 80 గ్రాముల బంగారు ధూళి విడుదలవుతోంది. ఏడాదికి దాదాపు 29 కిలోల బంగారు ధూళి వెలువడుతుండగా, దీని అంచనా విలువ రూ.18.9 కోట్లు.
ఈ సూక్ష్మ బంగారు కణాలు గాలిలో వెయ్యి కిలోమీటర్ల వరకు ప్రయాణించి అనంతరం అంటార్కిటికా మంచుపై పేరుకుపోతున్నాయని పరిశోధకులు తెలిపారు. మౌంట్ ఎరెబస్ అగ్నిపర్వతం ప్రత్యేక భౌగోళిక లక్షణాలను, అగ్నిపర్వతాల నుంచి వెలువడే ఖనిజ కణాల వ్యాప్తిని అర్థం చేసుకోవడంలో ఈ అధ్యయనం కీలకంగా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!