

సినీ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు. సినిమాలతో పాటు సామాజిక అంశాలపై కూడా తన అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తం చేస్తుంటారు. తాజాగా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఓ వీడియోలో మహిళలకు సంబంధించిన కొన్ని సంప్రదాయాలపై ఆమె ప్రశ్నలు లేవనెత్తారు. ముఖ్యంగా భర్త మరణించిన తర్వాత మహిళలు బొట్టు, గాజులు, గజ్జెలు వంటి వాటిని ఎందుకు తొలగించాలనే విషయంపై తన ఆలోచనలను పంచుకున్నారు.
తన తండ్రి మరణించిన తర్వాత తల్లి బొట్టు, గాజులు, గజ్జెలు ధరించడం మానేయడం తనను మూడేళ్లుగా ఆలోచింపజేస్తోందని అనసూయ తెలిపారు. ఇవన్నీ మహిళల వ్యక్తిగత ఇష్టానికి సంబంధించిన విషయాలని, వాటిని వివాహంతో లేదా భర్తతో ఎందుకు ముడిపెట్టాలని ప్రశ్నించారు. మహిళ బొట్టు పెట్టుకోవాలా, వద్దా? గాజులు ధరించాలా, వద్దా? అనేది ఆమె వ్యక్తిగత నిర్ణయంగా ఉండాలని పేర్కొన్నారు. తాను ఎవరికీ వ్యతిరేకంగా మాట్లాడటం లేదని, ప్రతి ఒక్కరికీ తమకు నచ్చిన విధంగా జీవించే స్వేచ్ఛ ఉండాలని అనసూయ స్పష్టం చేశారు. ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!