

దేశవ్యాప్తంగా విద్యుత్ పంపిణీ వ్యవస్థలో కీలక మార్పులు తీసుకురావడానికి కేంద్ర విద్యుత్ శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. టెలికాం రంగంలో ఉన్న విధానాన్ని పోలి, విద్యుత్ రంగంలోనూ ప్రైవేట్ సంస్థలకు వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేసే అవకాశం కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ విధానాన్ని అమలు చేయాలని అన్ని రాష్ట్రాలకు సూచనలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ప్రతిపాదిత విధానం ప్రకారం, డిస్కంల ఆధ్వర్యంలో ఉన్న విద్యుత్ లైన్లను వినియోగించుకునేందుకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ERC) నిర్ణయించే వీలింగ్ ఛార్జీలను చెల్లించి ప్రైవేట్ కంపెనీలు లైసెన్స్ పొందవచ్చు. కొత్త సబ్స్టేషన్లు, లైన్లు ఏర్పాటు చేయకుండా ఇప్పటికే ఉన్న వ్యవస్థను ఉపయోగించుకుని వినియోగదారులకు విద్యుత్ అందించనున్నారు. అయితే, ప్రైవేట్ సంస్థలు వినియోగదారుల నుంచి అధిక విద్యుత్ బిల్లులు వసూలు చేసే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!