
జనరల్

సామాజిక మాధ్యమాల్లో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవితపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీస్ కానిస్టేబుల్పై వేటు పడింది. 2018 బ్యాచ్కు చెందిన కే. అనిల్ ప్రస్తుతం సైబరాబాద్ సీఏఆర్ నుంచి ఆర్డర్ టు సర్వ్లో భాగంగా హైదరాబాద్ సీఏఆర్ హెడ్క్వార్టర్స్లో విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో కవితను ఉద్దేశించి ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు అధికారుల దృష్టికి వెళ్లాయి.
ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషనర్ రమేష్ రెడ్డి కానిస్టేబుల్ అనిల్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ శాఖలో పనిచేసే ప్రతి ఉద్యోగి క్రమశిక్షణ, వృత్తిపరమైన ప్రవర్తన, గౌరవప్రదమైన వ్యవహారశైలిని పాటించాలని ఆయన స్పష్టం చేశారు. సోషల్ మీడియాను ఉపయోగించే సమయంలో పోలీస్ సిబ్బంది బాధ్యతాయుతంగా, సంయమనంతో వ్యవహరించాలని సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!