

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న చిత్రం ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్. ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటుడు శివాజీ, వాసుకి ఆనంద్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో మేకర్స్ ప్రమోషన్స్ను వేగవంతం చేశారు. ఈ సందర్భంగా ఓటీటీ ప్లాట్ఫామ్లపై శివాజీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఓటీటీలు ఇంట్లోనే ఉండాలనుకునే వారికి ఉపయోగపడతాయని, తాను నటించిన హిట్ వెబ్ సిరీస్ 90s – ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ థియేటర్లలో విడుదలై ఉంటే సులభంగా రూ.100 కోట్ల గ్రాస్ వసూలు చేసేదని ఆయన అన్నారు.
థియేటర్లో సినిమా చూసే అనుభూతి ప్రత్యేకమని, ఇంట్లో కూర్చొని ఓటీటీల్లో సినిమాలు చూసే అలవాటు ప్రేక్షకులను బద్ధకస్తులుగా మారుస్తోందనే ఉద్దేశంతో శివాజీ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఆయన అభిప్రాయానికి కొందరు మద్దతు ఇస్తుండగా, బిజీ లైఫ్స్టైల్, పెరిగిన టికెట్ ధరల నేపథ్యంలో కుటుంబంతో కలిసి ఇంట్లోనే వినోదాన్ని ఆస్వాదించే అవకాశం ఓటీటీలు కల్పిస్తున్నాయని మరికొందరు విమర్శిస్తున్నారు. 90s – ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ ఈటీవీ విన్లో బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకుని శివాజీకి సెకండ్ ఇన్నింగ్స్లో భారీ క్రేజ్ తెచ్చిపెట్టింది. ఈ సిరీస్ విజయంతో ఆయనకు వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!