

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదివారం హైదరాబాద్ మెట్రో రైల్లో ప్రయాణించి సేవలు, ప్రయాణికుల సౌకర్యాలు, నిర్వహణ, ఇతర కార్యకలాపాలను పరిశీలించారు. బేగంపేట్ మెట్రో స్టేషన్ నుంచి ప్యారడైజ్ మెట్రో స్టేషన్ వరకు ఆయన మెట్రోలో ప్రయాణించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, అడిషనల్ ఎండీ అజిత్ రెడ్డి సీఎస్ వెంట ఉన్నారు.
ప్రయాణ సమయంలో మెట్రో రైళ్లలో రద్దీ, స్టేషన్లలో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, రైళ్ల నిర్వహణ, ప్రయాణికులకు అందుతున్న సేవలను సీఎస్ పరిశీలించారు. నగరంలో పెరుగుతున్న రవాణా అవసరాలకు అనుగుణంగా మెరుగైన కనెక్టివిటీ, భద్రత, ప్రయాణికుల సౌకర్యాలను కల్పించే చర్యలపై అధికారులతో చర్చించారు. సేవల నాణ్యతను నిరంతరం మెరుగుపరచాలని సూచిస్తూ, సాధారణ ప్రయాణికుడిగా ప్రయాణించడం ద్వారా వారి అనుభవాలు, అవసరాలు, సమస్యలను తెలుసుకోవడమే పర్యటన ఉద్దేశమని తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!