
జనరల్

హైదరాబాద్లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కౌలాలంపూర్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులు తమ ప్యాంట్ల నడుము భాగంలో ప్రత్యేక పౌచ్లలో పేస్ట్ రూపంలో బంగారాన్ని దాచి అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించినట్లు అధికారులు గుర్తించారు.
తనిఖీల సమయంలో 24 క్యారెట్లకు చెందిన 2.271 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.3.36 కోట్లు ఉంటుందని వెల్లడించారు. నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసిన కస్టమ్స్ అధికారులు, అక్రమ బంగారం రవాణాపై మరింత విచారణ కొనసాగిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!