
బిజినెస్

అమరావతిలో ఏడు చోట్ల ఎనర్జీ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) టెండర్లను ఆహ్వానించింది. ఈ ప్రాజెక్టు కోసం మొత్తం 18.25 ఎకరాల భూమిని కేటాయించారు. అనంతవరం, కురగల్లు, నేలపాడు, వెలగపూడి ప్రాంతాల్లో ఈ ఎనర్జీ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ చర్యతో రాజధాని ప్రాంతంలో ఇంధన, ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు మరింత బలోపేతం కానున్నాయి.
ఈ ఎనర్జీ స్టేషన్లలో పెట్రోల్, డీజిల్, సీఎన్జీతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఛార్జింగ్ సదుపాయం అందుబాటులో ఉంటుంది. అమరావతి ప్రాంతంలో పెరుగుతున్న ఈవీ వినియోగానికి అనుగుణంగా ఈ స్టేషన్లు ఉపయోగపడనున్నాయి. వాహనదారులకు ఒకే చోట వివిధ రకాల ఇంధనాలు, ఛార్జింగ్ సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!