
సినిమాలు

ముంబయికి చెందిన ఐనాక్స్ సంస్థ భారీ సైబర్ మోసానికి గురైంది. కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిద్ధార్థ్ జైన్ పేరుతో నకిలీ వాట్సాప్ ఖాతా సృష్టించిన కేటుగాళ్లు, అకౌంట్స్ విభాగంలోని డిప్యూటీ జనరల్ మేనేజర్ గిరీష్ అమిన్ను నమ్మించి కోట్ల రూపాయలు బదిలీ చేయించుకున్నారు. డీపీగా సంస్థ అధికారి ఫొటో ఉండటంతో ఉద్యోగి అది నిజమైన నంబరేనని భావించాడు.
జూన్ 3 నుంచి 15 మధ్య అత్యవసర అవసరాల పేరుతో మొత్తం 63 లావాదేవీల ద్వారా సుమారు రూ.10.4 కోట్లు బదిలీ అయ్యాయి. అకౌంట్ల తనిఖీ సమయంలో ఈ మోసం వెలుగులోకి రావడంతో సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన ముంబయి పోలీసులు బ్యాంకు ఖాతాల వివరాల ఆధారంగా నలుగురిని అరెస్టు చేశారు. ఈ మోసంలో మరికొందరి ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్న అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!