
జనరల్

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సమీపంలో వశిష్ఠ గోదావరి నదికి వరద ఉధృతి పెరిగింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నరసాపురం–సఖినేటిపల్లి మధ్య పడవల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. కనకాయలంక కాజ్వేపైకి వరద నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
లంక గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు నిత్యావసర వస్తువులను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. వరద పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!