
జనరల్

తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాల్లో భాగంగా రెండోరోజైన సోమవారం పవిత్రాల సమర్పణ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఉదయం యాగశాలలో హోమాలు, పలు వైదిక కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం సంపంగి ప్రాకారంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామికి స్నపన తిరుమంజనం నిర్వహించారు.
శ్రీవారి మూలవర్లు, ఉత్సవమూర్తులు, ఆలయంలోని పరివారదేవతలు, ధ్వజస్తంభం, శ్రీభూవరాహస్వామి, శ్రీబేడి ఆంజనేయస్వామివారికి పవిత్రమాలలు సమర్పించారు. సాయంత్రం మలయప్పస్వామి ఆలయ మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమాల్లో తితిదే ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్యచౌదరి పాల్గొన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!