

అమెరికా పర్యటనకు గుజరాత్ ముఖ్యమంత్రికి అనుమతిచ్చి, తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి అనుమతి నిరాకరించడంపై కేంద్ర ప్రభుత్వంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఇది తనకు వ్యక్తిగతంగా జరిగిన అవమానం కాదని, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు, రాష్ట్ర అభివృద్ధికి జరిగిన అన్యాయమని అన్నారు. విద్య, క్రీడలు, పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా అమెరికా, కెనడా పర్యటనకు ప్రణాళిక రూపొందించామని, అన్ని వివరాలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సమర్పించామని తెలిపారు. రాజకీయ కారణాలతో అమెరికా పర్యటనను తిరస్కరించినట్లు కేంద్రం పేర్కొందని, ఆ కారణాలను ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించాలని డిమాండ్ చేశారు.
కేంద్రం నిర్ణయాన్ని పార్లమెంట్లో ప్రస్తావించి రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడతామని రేవంత్రెడ్డి చెప్పారు. తన పర్యటనను అడ్డుకున్నా తెలంగాణ అభివృద్ధి లక్ష్యాలను అడ్డుకోలేరని స్పష్టం చేశారు. డిసెంబరు 8, 9 తేదీల్లో ‘తెలంగాణ గ్లోబల్ సమిట్ 2026’ నిర్వహించి పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అమెరికా పర్యటనలో ట్రంప్, వాన్స్లను కలిసేందుకు అపాయింట్మెంట్లు కోరినట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. ఇదిలా ఉండగా, మంత్రి కొండా సురేఖ కుమార్తె వ్యాఖ్యలపై నెలకొన్న వివాదం పార్టీ క్రమశిక్షణ కమిటీ పరిధిలో ఉందని, అధిష్ఠానం తీసుకునే నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉంటారని సీఎం స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!