

ఫ్రాన్స్లో జరిగిన జీ7 సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రధాని నరేంద్ర మోదీ సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొనకపోవడానికి ట్రంప్ విదేశీ నేతలతో వ్యవహరించే తీరుపై అనిశ్చితి ఉండటమే కారణమని ప్రభుత్వ వర్గాలు వెల్లడించినట్లు సమాచారం. ట్రంప్తో భేటీకి ముందే సంయుక్త మీడియా సమావేశం వద్దని భారత ప్రభుత్వం సూచించినట్లు అమెరికా రాయబారి సెర్గియో గోర్ ఇటీవల ఓ చర్చా వేదికలో చెప్పిన నేపథ్యంలో ఈ వివరణ వెలువడింది. నేతల బహిరంగ కార్యక్రమాల్లో చర్చలు సాధారణ దౌత్య ప్రొటోకాల్లో భాగమేనని, మీడియా సమావేశంలో మోదీ పాల్గొనకపోవడానికి ఇతర కారణాలేమీ లేవని ప్రభుత్వం స్పష్టం చేసినట్లు సమాచారం.
జూన్ 17న ట్రంప్, మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరుదేశాల మధ్య గతంలో నెలకొన్న విభేదాల నేపథ్యంలో ఈ భేటీ సంబంధాల బలోపేతానికి దోహదపడుతుందని భావించినప్పటికీ, ఇద్దరు నేతలు కలిసి మీడియా ముందుకు రాలేదు. అయితే ఈ అంశంపై సెర్గియో గోర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మోదీతో సమావేశానికి ముందు భారత విదేశీ వ్యవహారాల శాఖ నుంచి ఎలాంటి ప్రశ్నలు అడగకుండా ఉండాలన్న అభ్యర్థన వచ్చిందని గోర్ తెలిపారు. సమావేశం అనంతరం ట్రంప్ మీడియా ప్రశ్నలకు సమాధానమిచ్చారని, ఆ సమయంలో భారతదేశానికి సంబంధించిన సూచనను ఆయన మరిచిపోయి ఉండొచ్చని వ్యాఖ్యానించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!