
రాజకీయాలు

హైదరాబాద్ నుంచి లండన్కు బయల్దేరిన బ్రిటిష్ ఎయిర్వేస్ (BA276) విమానంలో మధ్య గగనంలోనే ముగ్గురు పైలట్లు అస్వస్థతకు గురైన ఘటన ఆందోళన కలిగించింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే 30 వేల అడుగుల ఎత్తులో ఒక పైలట్ తీవ్ర అస్వస్థతకు గురై శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొనడంతో ఆక్సిజన్ అందించారు. ఈ సమయంలో మరో ఇద్దరు పైలట్లు కూడా స్వల్ప అస్వస్థతకు గురైనట్లు సమాచారం.
అయితే పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొన్న సిబ్బంది విమానాన్ని లండన్లోని హీత్రూ విమానాశ్రయంలో సురక్షితంగా దించారు. ఈ ఘటనపై విమానయాన సంస్థ దర్యాప్తు ప్రారంభించింది. ప్రయాణికులు, సిబ్బంది భద్రతే తమకు ముఖ్యమని సంస్థ వెల్లడించింది. హైదరాబాద్లోని ఒక హోటల్లో తీసుకున్న అల్పాహారం కారణంగా ఫుడ్ పాయిజనింగ్ జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. బాధిత పైలట్లకు తగిన వైద్య సహాయం అందించారు.













కామెంట్స్ (1)
👏