
సినిమాలు

శ్రీలంకలో భారీ వర్షాలు తీవ్ర బీభత్సం సృష్టిస్తున్నాయి. కుండపోత వర్షాల కారణంగా వరదలు, కొండచరియలు విరిగిపడటంతో ఇప్పటివరకు ఏడుగురు మృతి చెందారు. పలు ప్రాంతాల్లో ఇళ్లు, వ్యవసాయ పొలాలు, రహదారులు నీట మునిగాయి. భారీ వర్షాలకు 291 ఇళ్లు దెబ్బతిన్నాయి.
వరద ప్రభావిత ప్రాంతాల నుంచి సుమారు 3,500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. విద్యా సంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు. వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!