

రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో బుధవారం వాదనలు పూర్తయ్యాయి. హుజూర్నగర్ ఉప ఎన్నికల ప్రచార సమయంలో నమోదైన క్రిమినల్ కేసులను కొట్టివేయాలని కోరుతూ దాఖలైన ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్ కె. సుజన తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించిన ఐదు వేర్వేరు కేసులను రద్దు చేయాలని పిటిషన్లలో కోరారు.
అప్పట్లో ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి రెడ్డి తరఫున ప్రచారంలో పాల్గొన్న సమయంలో అనుమతి లేకుండా రోడ్షో నిర్వహించడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయని, స్పీకర్లు, మ్యూజిక్ సిస్టమ్ల వినియోగంతో ప్రజలకు అసౌకర్యం కలిగించారని అధికారులు ఆరోపించారు. ఈ కేసుల్లో పద్మావతి రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, గీతా రెడ్డి తదితరులు కూడా నిందితులుగా ఉన్నారు. ఈ ఐదు కేసుల భవితవ్యంపై హైకోర్టు తుది తీర్పు వెలువరించాల్సి ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!