
సినిమాలు

విశాఖపట్నం జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆనందపురం–అనకాపల్లి జాతీయ రహదారిపై గండిగుండం సమీపంలో కారు అదుపుతప్పి లారీని ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పల్నాడు జిల్లా వినుకొండ నుంచి శ్రీకాకుళం జిల్లా టెక్కలికి శుభకార్యానికి వెళ్తున్న కుటుంబ సభ్యులు ఈ ప్రమాదానికి గురయ్యారు.
కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో డ్రైవర్తో పాటు నలుగురు ప్రాణాలు కోల్పోగా, నరసరావుపేట ఎమ్మెల్యే పీఏ చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో చంద్రశేఖర్ కుమారుడు కూడా ఉన్నట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!