

అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రంలో జరిగిన స్కైడైవింగ్ ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన గడ్డం మణి చంద్రతేజ (28) మృతి చెందాడు. స్కైడైవింగ్పై ఆసక్తి ఉన్న చంద్రతేజ గతంలోనూ పలుమార్లు డైవింగ్ చేశాడు. అయితే ఆదివారం స్కైడైవింగ్ ముగించుకుని పారాచూట్ సాయంతో కిందకు దిగుతున్న సమయంలో ఒక్కసారిగా బలమైన గాలులు వీయడంతో పారాచూట్ నియంత్రణ తప్పింది. దీంతో సుమారు 30 అడుగుల ఎత్తు నుంచి కిందపడిపోయిన ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే సమీప ఆస్పత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ కన్నుమూశాడు.
విజయవాడకు చెందిన చంద్రతేజ కుటుంబం అనంతరం హైదరాబాద్లో స్థిరపడింది. ఆయన ఐసీఎఫ్ఏఐ ఫౌండేషన్లో విద్యాభ్యాసం పూర్తి చేసి, 2022లో ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లాడు. గత రెండేళ్లుగా బోస్టన్లో సాఫ్ట్వేర్ డెవలపర్గా పనిచేస్తున్నాడు. ఈ విషాద ఘటన కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు సహచరులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!