

న్యాయ రంగంలో పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడానికి భారత్ మరియు రష్యా కీలక ఒప్పందంపై సంతకాలు చేశాయి. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ మరియు రష్యా అత్యున్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్ ఐగోర్ క్రాస్నోవ్ ఈ ఒప్పందాన్ని అధికారికంగా అమలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా న్యాయ ప్రక్రియల్లో సహకారం, జ్ఞాన మార్పిడి, సంస్థాగత వ్యవస్థల బలోపేతం సాధ్యమవుతుంది.
ఈ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ, న్యాయవ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ఇరుదేశాల ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. వ్యవస్థలు మారినా, సాంకేతికత అభివృద్ధి చెందినా న్యాయం అందించడం కోర్టుల మౌలిక విధి అని అన్నారు. కృత్రిమ మేధ సమాచార నిర్వహణ, అనువాదం, ట్రాన్స్స్క్రిప్ట్ తయారీ వంటి పనుల్లో సహాయపడగలదని, కానీ తీర్పులను ప్రభావితం చేయలేదని స్పష్టం చేశారు. సాక్షుల విశ్వసనీయతను అంచనా వేయడంలో న్యాయమూర్తుల విచక్షణే కీలకమని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!