

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ప్రైవేట్ స్థలాల్లో హోటళ్ల నిర్మాణానికి ప్రభుత్వం రాయితీలు ఎలా కల్పిస్తుందని ఆయన ప్రశ్నించారు. రెడిసన్ బ్లూ, ఎసెన్షియల్ వంటి సంస్థలకు అనుమతులు ఇచ్చారని, ఈ నెల 20న మూడు హోటళ్లకు అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆరోపించారు. దామినేడులో సీఆర్ఆర్ హాస్పిటాలిటీ సంస్థకు భారీ రాయితీలు కల్పించారని, 1.71 సెంట్ల స్థలంలో స్టార్ హోటల్ నిర్మాణానికి పలు ప్రయోజనాలు కల్పించడంతో పాటు ఐదేళ్లపాటు ఉచిత విద్యుత్ వంటి రాయితీలు ఇచ్చారని విమర్శించారు. సీఆర్ఆర్ హాస్పిటాలిటీ సంస్థకు గతంలో స్టార్ హోటళ్ల నిర్మాణ అనుభవం ఉందా, సంస్థ ఆర్థిక స్థితి ఏమిటో ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు. గూగుల్లో కూడా సంస్థకు సంబంధించిన వివరాలు కనిపించడం లేదని ఆయన ఆరోపించారు. దామినేడులో 21 ఎకరాల భూమిని ఎకరాకు రూ.90 లక్షల చొప్పున కేటాయించారని, చిన్న ఇంటి చిరునామాతో ఉన్న సంస్థకు భారీ హోటల్ నిర్మాణానికి అనుమతులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.
ఈ వ్యవహారంలో రాష్ట్ర బోర్డు అనుమతులు ఎలా మంజూరు చేశారో ప్రభుత్వం స్పష్టం చేయాలని భూమన కోరారు. ఒకే ప్రాంతంలో వ్యాపార కేంద్రాల కోసం భారీ విలువైన భూములను తక్కువ ధరకే కేటాయించారని ఆయన ఆరోపిస్తూ, ఈ నిర్ణయాల వెనుక ఉన్న వ్యక్తులు ఎవరో బయటకు రావాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే తిరుపతిలో పర్యాటకుల రాకతో వసతి సదుపాయాలపై ఒత్తిడి ఉందని, నగరంలో గృహ వసతి కేంద్రాలు గణనీయంగా పెరిగాయని పేర్కొన్నారు. సుమారు రూ.600 కోట్లతో నిర్మించిన వసతి గృహాలను ముఖ్యమంత్రి ప్రారంభించనున్న నేపథ్యంలో కొత్త స్టార్ హోటళ్లకు అనుమతులు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు. హోటళ్ల అనుమతుల వెనుక ఉన్న ఉద్దేశం, ఏదైనా కుట్ర ఉంటే దానిని ప్రభుత్వం వెంటనే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని స్పష్టం చేస్తూ, ప్రభుత్వం వెంటనే స్పందించి పూర్తి వివరాలను ప్రజలకు వెల్లడించాలని భూమన కోరారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!