

పాకిస్థాన్లోని కరాచీలో గ్యాంగ్స్టర్, నిషేధిత పీపుల్స్ అమన్ కమిటీ మాజీ చీఫ్ ఉజైర్ బలోచ్ సోదరుడు జుబైర్ బలోచ్పై గురువారం సాయంత్రం గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఇంటి బయట ఉన్న సమయంలో మోటార్ సైకిల్పై వచ్చిన దుండగులు కాల్పులకు తెగబడగా, జుబైర్ ఛాతి, పొత్తి కడుపులో బుల్లెట్ గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఈ ఘటనలో మరో ఇద్దరు పాదచారులు కూడా గాయపడ్డారు. ముఖాలకు ముసుగులు ధరించిన దుండగులు కాల్పులు జరిపిన తర్వాత ఓ దుకాణదారుడు ఎదురు కాల్పులు చేయడంతో వారు పరారైనట్లు పోలీసులు తెలిపారు. పాత గ్యాంగ్ వార్ కక్షల నేపథ్యంలోనే ఈ దాడి జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదే సమయంలో లియారీ ప్రాంతంలో మళ్లీ గ్యాంగ్ వార్ చెలరేగే అవకాశాలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!