
జనరల్

ఐఎస్ఐఎస్, అల్ఖైదా సిద్ధాంతాలను ఆన్లైన్లో ప్రచారం చేస్తున్నారనే కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దేశవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఈ దాడులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో మంగళవారం చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ కేసులో ఇప్పటివరకు 11 మంది నిందితులతో పాటు ఒక బాలుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఎన్ఐఏ తెలిపింది. సోదాల సందర్భంగా పలు డిజిటల్ పరికరాలు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను స్వాధీనం చేసుకున్న అధికారులు, వాటిని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించి మరిన్ని ఆధారాలు సేకరించనున్నట్లు వెల్లడించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!