
జనరల్

'కలర్స్' కార్యక్రమంతో గుర్తింపు తెచ్చుకుని, తెలుగు చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి స్వాతి రెడ్డి మరోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. దర్శకుడు శ్రీకాంత్ నాగోతిని ఆమె వివాహం చేసుకున్నట్లు సోషల్ మీడియాలో పంచుకున్న ఫొటోల ద్వారా వెల్లడైంది. ఈ వివాహం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో సాదాసీదాగా జరిగినట్లు తెలుస్తోంది.
స్వాతి గతంలో 2018లో పైలట్ వికాస్ వాసును వివాహం చేసుకున్నారు. అనంతరం ఆమె వ్యక్తిగత జీవితంపై బహిరంగంగా స్పందించలేదు. 2023లో విడుదలైన 'మంత్ ఆఫ్ మధు' చిత్రంలో కలిసి పనిచేసిన దర్శకుడు శ్రీకాంత్ నాగోతితో ఇప్పుడు వివాహం చేసుకోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!