
సినిమాలు

పూరీలో జరిగిన ఘటనపై ఒడిశా ప్రభుత్వం అధికారికంగా స్పందించింది. జగన్నాథ రథయాత్ర సందర్భంగా తొక్కిసలాట జరిగిందన్న వార్తలను ఖండించిన ప్రభుత్వం, అలాంటి ఘటన ఏదీ చోటుచేసుకోలేదని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఒడిశా ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) అధికారిక ప్రకటనలో వెల్లడించింది.
సీఎంఓ ప్రకారం, రథయాత్ర సందర్భంగా ఇద్దరు భక్తులు అనారోగ్య కారణాల వల్ల మృతిచెందారని తెలిపింది. ఈ మరణాలు తొక్కిసలాట కారణంగా సంభవించలేదని స్పష్టం చేస్తూ, భక్తులు మరియు ప్రజలు నిర్ధారించని వార్తలను నమ్మవద్దని అధికారులు సూచించారు. అధికారిక సమాచారం ఆధారంగానే స్పందించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!