
క్రీడలు

జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంచనపల్లి గ్రామంలో వ్యవసాయ పనులు చేస్తున్న స్వప్న అనే మహిళపై సుమారు 15 అడుగుల కొండచిలువ దాడి చేసింది. పొదల నుండి వచ్చిన ఆ భారీ పాము ఆమెను చుట్టుకుని మింగేందుకు ప్రయత్నించింది. భయంతో ఆమె అరవడంతో సమీపంలో ఉన్న రైతులు, కూలీలు అప్రమత్తమయ్యారు.
వెంటనే అక్కడికి చేరుకున్న వారు కొండచిలువపై దాడి చేసి స్వప్నను రక్షించారు. అనంతరం పామును గోనెసంచిలో బంధించి, బాధితురాలితో కలిసి జనగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రాథమిక చికిత్స అందించి, కొండచిలువలకు విషం లేకపోయినా అవి ప్రమాదకరమని తెలిపారు. ప్రస్తుతం స్వప్న ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!