

తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఇంటింటికీ తెలుగుదేశం – రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం’ కార్యక్రమం కీలక మైలురాయిని చేరుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా 21 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 61.61 లక్షల కుటుంబాలను టీడీపీ నాయకులు, కార్యకర్తలు నేరుగా కలిశారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను వివరించడంతో పాటు వారి అభిప్రాయాలు, స్థానిక సమస్యలను తెలుసుకుంటున్నారు.
కార్యక్రమంలో భాగంగా 21వ రోజైన ఆదివారం ఒక్కరోజే 2.60 లక్షల కుటుంబాలతో పార్టీ శ్రేణులు మమేకమయ్యాయి. రైతు సంక్షేమం, మహిళా సాధికారత, యువతకు ఉపాధి, పేదల సంక్షేమం, మౌలిక వసతుల కల్పన వంటి అంశాలను ప్రజలకు వివరిస్తున్నారు. ప్రజల నుంచి వచ్చిన వినతులు, స్థానిక సమస్యలను సంబంధిత ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు పార్టీ తెలిపింది. 60 లక్షల ఇళ్ల సందర్శన మైలురాయిని అధిగమించిన స్ఫూర్తితో కార్యక్రమాన్ని మరింత వేగంగా, విస్తృతంగా కొనసాగిస్తామని టీడీపీ నేతలు పేర్కొన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!