

హైదరాబాద్లోని ఏడు ప్రముఖ రెస్టారెంట్లపై తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (టీజీ సేఫ్) ప్రత్యేక తనిఖీలు నిర్వహించింది. బంజారాహిల్స్లో చట్నీస్, స్పైస్ 6, ఓహ్రీస్, జూబ్లీహిల్స్లో ది స్పైసీ వెన్యూ, టోలిచౌకిలో 4 సీజన్స్ మల్టీ-క్యూజిన్, షా గౌస్, గచ్చిబౌలిలో పిస్తా హౌస్లను అధికారులు తనిఖీ చేశారు. కొన్ని రెస్టారెంట్లలో పరిశుభ్రత లోపాలు, గడువు ముగిసిన ఆహార పదార్థాలు, ఆహార పదార్థాల నిల్వ, నిర్వహణలో నిబంధనల ఉల్లంఘనలు, పాడైన కూరగాయలు, లేబులింగ్ లోపాలు, పురుగుల బెడద ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
తనిఖీల్లో కల్తీపై అనుమానం ఉన్న 11 ఆహార నమూనాలను అధికారులు సేకరించి ప్రయోగశాల పరీక్షలకు పంపారు. నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి నాలుగు ఇంప్రూవ్మెంట్ నోటీసులు, మూడు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. గచ్చిబౌలిలోని పిస్తా హౌస్లో నిల్వ గదిలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు గుర్తించిన పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ల్యాబ్ పరీక్షల ఫలితాలు, సంబంధిత సంస్థల వివరణల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు టీజీ సేఫ్ పేర్కొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!