
జనరల్

న్యూయార్క్లో జరిగిన ‘వన్ వరల్డ్, వన్ హ్యూమానిటీ’ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూ రాష్ట్రం అంటే భారత్ నుంచి ముస్లింలను వెళ్లగొట్టడం కాదని స్పష్టం చేశారు. భారత్ సంప్రదాయంగా అన్ని వర్గాల ప్రజలకు ఆశ్రయం కల్పించిందని, భిన్నత్వంలో ఏకత్వం దేశ స్వభావంలోనే ఉందని పేర్కొన్నారు.
భిన్నత్వాన్ని గౌరవిస్తూ, ప్రతి మనిషి గౌరవాన్ని కాపాడటం అవసరమని భగవత్ అన్నారు. వైవిధ్యం ప్రకృతి సహజమని, ఏకత్వమే దాని అంతర్లీన బలమని పేర్కొన్నారు. ప్రపంచ మానవత్వం ఒక్కటేననే సందేశాన్ని సమాజంలో విస్తరించడం ఆర్ఎస్ఎస్ బాధ్యతగా భావిస్తోందన్నారు. సమాజం నుంచి పొందినదాన్ని తిరిగి సమాజానికి అందించాల్సిన అవసరాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!